Sunday, 11 March 2012

M.P. గడ్డం వివేకానంద (వివేక్ )

కాంగ్రెస్ కురు వృద్ధుడు జి. వెంకట స్వామి కుమారుడైన వివేక్ నవంబర్ 30,1957 న జన్మించారు.
తల్లి పేరు- కళావతి. 
సోదరుడి పేరు వినోద్.( చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే ,కార్మిక శాఖామంత్రి )
ఉస్మానియా యూనివర్సిటీ లో MBBS చదివారు.. ఆ తర్వాత సరోజన తో వివాహం అయింది.వీరికి నలుగురు సంతానం.ఇద్దరు అమ్మాయిలు వృత్తిక, వైష్ణవి. అబ్బాయిలు- వంశీ కృష్ణ, వెంకట్.
హైదరాబాద్ లో నివాసముంటున్నారు. 1985 లో విశాఖ ఇండస్ట్రీస్ ని నెలకొల్పాడు.వ్యాపార నైపుణ్యంతో అనేక అవార్డులని కూడా గెలుపొందాడు.
వివేక్ కి వృతి వ్యాపారాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలంటే ఇష్టం. అందుకే 2000 సంవత్సరంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి  దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇవి కాక తనకి  క్రికెట్, గోల్ఫ్ ఆడటమంటే సరదా.
            తండ్రి నుండి రాజకీయ వారసత్వం తీసుకొని తొలిసారిగా 2009 లో పెద్ద పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి సమీప TRS పార్టీ నేత గోమాస శ్రీనివాస్ పై 49,017 ఓట్ల ఆధిక్యం తో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలలో వివేకానందకి 3,13,748 ఓట్లు రాగా గోమాస శ్రీనివాస్ కి 2,64,731 ఓట్లు పోలయ్యాయి.
ఇక  ప్రస్తుతం పార్లమెంట్ లో కోల్, స్టీల్ విభాగాల సభ్యునిగా కొనసాగుతున్నారు. 2006-07 లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (mp చాప్టర్) చైర్మన్ గా కొనసాగారు. మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.


విశాఖ ఛారిటబుల్ ట్రస్ట్ లింక్ :
www.visaka.biz/csr.php

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers