జైపూర్ మండలం రామారావు పేటకి చెందిన చిప్పకుర్తి వెంకటేష్ రక్త దాన అవసరాన్ని స్వీయానుభవంతో తెలుసుకొని , ఇతరులకి సహాయపడాలన్న ఆశయంతో అమ్మ యూత్ వెల్ఫేర్ సొసైటీ ని స్థాపించాడు. 2007లో 10 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 350 మంది సభ్యులతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరి సేవలకి గుర్తింపుగా 2010లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉత్తమ యువజన సంఘం అవార్డుకి ఎంపికయ్యింది. బంగారు పతకంతో పాటు 10 వేల రూపాయల నగదు అందుకున్నారు.
No comments:
Post a Comment