Tuesday, 6 March 2012

పిల్లల్ని దత్తత తీసుకునే పద్ధతి

పిల్లలు లేని దంపతులకి దత్తత ఒక వరం లాంటిది. మహిళా శిశు సక్షేమ శాఖ (ICDS)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహలో అనాధ శిశువు లెందరో సంరక్షించబడుతున్నారు. అందులో పెరిగే పిల్లలని పెంచుకోవాలనుకునే వారు చట్టపరంగా దత్తత తీసుకోవచ్చు.


నిబంధనలు :

  • దంపతులు దత్తత తీసుకోవాలంటే ఆ దంపతులకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు జారీ చేసిన ధృవీకరణ పత్రం తప్పనిసరి.
  • పిల్లలు దత్తత తీసుకునే దంపతులలో ఏ ఒక్కరి వయస్సు 55 సంవత్సరాలు మించకూడదు.
  • 45 ఏళ్ళ వయసున్న దంపతులు నెలలు నిండిన పాప నుంచి ఒక ఏడాది వయసు గల పిల్లలను దత్తత తీసుకోవడానికి అర్హులు. వీరి సగటు ఆదాయం నెలకి రూ.5 వేలు ఉండాలి. దత్తత తీసుకున్న పిల్లలని పోషించగల స్తోమత ఉండాలి.
  • పెళ్లి కాని మహిళలు,పురుషులు, వితంతువులు, ఎవరైనా పిల్లలని దత్తత తీసుకోవచ్చు.కానీ తీసుకునే ముందు షురిటీ సంతకం పెట్టాలి.
  • విడాకులు పొందిన,పెళ్లి కాని వ్యక్తుల వయస్సు 30-45 సంవత్సరాల మధ్య ఉండాలి.దత్తత కోరే ఒంటరి తండ్రి/తల్లి కి , పిల్లల మధ్య వయోభేదం 21 సంవత్సరాలు ఉండాలి.
దత్తత కోరే తల్లి తండ్రుల వయసు 45 సంవత్సరాలు దాటితే ,ఆ తల్లిదండ్రుల వయసుని బట్టి పిల్లల వయసు ఎన్నుకోవాలి. 

తల్లిదండ్రుల వయసు -               బిడ్డ వయసు గ్రూపు 
46 సంవత్సరాలు                    1-2 సంవత్సరాలు 
47 సంవత్సరాలు                    2-3 సంవత్సరాలు 
48 సంవత్సరాలు                    3-4 సంవత్సరాలు 
49 సంవత్సరాలు                    4-5 సంవత్సరాలు 
50 సంవత్సరాలు                    5-14 సంవత్సరాలు 

దరఖాస్తు చేసే పద్ధతి :

శిశువుల్ని దత్తత తీసుకునే పిల్లలు ముందుగా  మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించాలి.
నెలసరి ఆదాయ ధృవపత్రం ,స్థిరాస్తులు , వైద్యులు ధ్రువీకరించిన పత్రాలతో ICDS PDకి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలు పరిశీలించి వారికి నమ్మకం కలిగితే శిశువుని అప్పగిస్తారు.
దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలకి క్రింది వెబ్ సైట్ ని సందర్శించండి.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers